వరంగల్ జిల్లా మామూనూరు విమానాశ్రయం ఏర్పాటుకి పౌరవిమానయాన శాఖ ఆమోదం తెలిపినప్పటి నుంచి అది మా కృషి వల్లే వస్తోందంటే కాదు మా వల్లే అంటూ కాంగ్రెస్, బీజేపిలు దాని క్రెడిట్ కోసం పోటీలు పడుతున్నాయి. ఇప్పుడు ఆ క్రెడిట్ పోటీలలో బిఆర్ఎస్ పార్టీ కూడా చేరింది. ఆ పార్టీ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మామూనూరు విమానాశ్రయం గురించి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కృషి చేశారని ట్వీట్ చేశారు. భూసేకరణకు, శంషాబాద్ విమానాశ్రయానికి 150కిమీ దూరంలో మరో విమానాశ్రయం ఉండకూడదనే నిబంధనకు మినహాయింపు ఇచ్చింది కూడా కేసీఆర్ హయంలోనే అని దానిలో పేర్కొన్నారు.
మామునూరు విమానాశ్రయం ఏర్పాటులో బిఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఎంతుందో ఆయన మాటల్లోనే విందాం.
మామునూరు ఎయిర్పోర్ట్ ను సాధించింది నేనంటే నేను అని @kishanreddybjp గారు , @revanth_anumula గారు వాదించటం హాస్యాస్పదం.వస్తే క్రెడిట్ నీకన్నా లేకపోతే మాకన్నా రావాలన్నట్టుంది కాంగ్రెస్ బీజేపీ వ్యవహారం . #BRS ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుండి 2023 అనేకమార్లు కేసీఆర్ గారు కేంద్రంతో ఈ… pic.twitter.com/d1wcwx9oJH
— Ravula Sridhar Reddy (@RSRBRS) March 4, 2025