నిజామాబాద్ బీజేపీ ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తున్న ధర్మపురి అర్వింద్ ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఏబీపీ దేశంకు ఇచ్చిన తాజా ఇంటర్యూలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్ ప్రచారం చేసింది. శాసనసభ ఎన్నికలకు మూడు నెలల ముందు మీ అధిష్టానం తీసుకున్న ఓ నిర్ణయం వలన బీజేపీ హటాత్తుగా పడిపోయింది. దీనిని మీరు ఏవిదంగా విశ్లేషిస్తారు?” అనే ప్రశ్నకు ధర్మపురి అర్వింద్ ఊహించని సమాధానం చెప్పారు.
“కాంగ్రెస్ ఎప్పుడూ ఇటువంటి దుష్ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఆనాడు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయకపోవడం వలన ఓడిపోయాము,” అని ధర్మపురి అర్వింద్ చెప్పారు.
“అందుకే ఆమెను లోక్సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేశారా?” అనే ప్రశ్నకు ధర్మపురి అర్వింద్ మళ్ళీ విచిత్రమైన సమాధానం చెప్పారు. ఈ అరెస్టుతో మా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది,” అని అన్నారు.
ధర్మపురి అర్వింద్ సమాధానమే ఆమె అరెస్టు వెనుక అసలు కారణం ఏమిటో బయటపడుతోంది కనుక ఇంకా వివరణ అవసరం లేదు.