ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాష్ టీవీ9కి దూరం అయిన తర్వాత ప్రస్తుతం ఆర్టీవీలో చేస్తున్నారు. ఆయన తెలంగాణలో 17 లోక్సభ స్థానాలపై సర్వే చేసి ఏ స్థానంలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందో తెలియజేస్తున్నారు. మెదక్ ఎంపీ సీటుకి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు.
బిఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామి రెడ్డిపై మల్లన్నసాగర్ భూనిర్వాసితులు ఆగ్రహంతో ఉన్నారని, ఈ కారణంగా నియోజకవర్గంలో మూడు ప్రధాన ప్రాంతాలలో ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు పడవచ్చని రవి ప్రకాష్ తెలిపారు.
కాంగ్రెస్ అభ్యర్ధి నీలం మధు ప్రభావం పటాన్చెరు, సంగారెడ్డి వరకే పరిమితమని కానీ రఘునందన్ రావుకి మొత్తం మెదక్ నియోజకవర్గంపై పూర్తి పట్టు కలిగి ఉండటం కలిసి వస్తుందని రవి ప్రకాష్ తెలిపారు.
ఈసారి సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక మూడు నియోజకవర్గాలలో ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని రవి ప్రకాష్ తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలి ఎటువైపు మొగ్గితే వారికే మెజార్టీ లభిస్తుందని రవి ప్రకాష్ తెలిపారు.
మొత్తంగా చూసుకుంటే మెదక్ నుంచి రఘునందన్ రావుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రవి ప్రకాష్ తెలిపారు.