నాడు జగనన్న సంధించిన బాణమే నేడు గుచ్చుకుంటోంది!

April 06, 2024


img

ఈసారి ఏపీ సిఎం, వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డికి సొంత చెల్లెళ్ళ వల్లనే అధికారం కోల్పోయేలా ఉన్నారు. ఒకరు తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల కాగా మరొకరు బాబాయ్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి.

ఇద్దరూ కలిసి జగన్మోహన్‌ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. వైఎస్ షర్మిల ఈసారి కడప నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆమెకు సునీత రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. 

వైఎస్ షర్మిల ఈరోజు కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో తన అన్న జగన్మోహన్‌ రెడ్డికి సూటిగా రెండు ప్రశ్నలు సందించారు.

1. వివేకానంద రెడ్డిని హత్య చేసిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్ళీ ఎందుకు టికెట్‌ ఇచ్చారు?

2. ఆయనను మీరు ఎందుకు వెనకేసుకు వస్తున్నారు? సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 

సునీతా రెడ్డి కూడా ఇదే అడుగుతూ, “మిమ్మల్ని నిలదీసి ప్రశ్నిస్తున్నందుకు నన్ను కూడా మా న్నాన్నగారిని చంపిన్నట్లు చంపేస్తారేమో?” అంటూ భయం వ్యక్తం చేశారు. 

వారిద్దరూ వైఎస్ కుటుంబానికే చెందినవారు కావడం, వారిలో ఒకరు సిఎం సొంత చెల్లెలు కావడంతో వారు అడుగుతున్న ఈ ప్రశ్నలకు జగన్మోహన్‌ రెడ్డి, ఆయన పార్టీ నేతలు, కడప వైసీపి అభ్యర్ధి అవినాష్ రెడ్డి ఎవరూ సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకొంటున్నారు. వారి ఆరోపణలు ఏపీ ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్నాయి.

ఇదివరకు జగన్మోహన్‌ రెడ్డి చంచల్‌గూడా జైల్లో ఉన్నప్పుడు జగన్‌ సందించిన బాణాన్ని అంటూ పాదయాత్రలు చేసి వైసీపిని కాపాడిన చెల్లి వైఎస్ షర్మిలే ఇప్పుడు వైసీపిని, అన్నని ఓడించడానికి రంగంలో దిగడంతో ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.


Related Post