బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారనే వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, “మా ఎమ్మెల్యేల జోలికి వస్తే మీ ప్రభుత్వం 48 గంటలలో పడిపోతుంది. జాగ్రత్త! కనుక అటువంటి ఆలోచన కూడా చేయొద్దని హెచ్చరిస్తున్నాను.
మీరు మోడీ, అమిత్ షాలను కలిసి రేవంత్ రెడ్డిని గద్దె దించేస్తాను సహకరించమని అడిగితే వారు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ అందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రి పదవి కోసం మీ ప్రభుత్వాన్ని మీరే కూలద్రోసుకునేందుకు వెనుకాడని మీరు మా పార్టీ గురించి మాట్లాడటం సిగ్గు చేటు.
మీతో బీజేపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారన్నారు. కనీసం మీ తమ్ముడు మీతో టచ్లో ఉన్నారా?ఆయన భార్యకు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వకుండా మీరే అడ్డుపడ్డారట కదా?మీ కుటుంబంలో సక్యత లేదు. మీ పార్టీలో లేదు. మీ ప్రభుత్వంలో కూడా లేదు.
ముఖ్యమంత్రి సీటుకి మీరు ఎసరు పెడతారని రేవంత్ రెడ్డి భయపడుతుంటే, ఆయనను గద్దె దించి ఆ కుర్చీలో కూర్చోవాలని మీరో పది మంది ఎదురుచూస్తున్నారు. కనుక గేట్లు ఎత్తే ఆలోచనలు మానుకొని ముందు మీ ప్రభుత్వం సుస్థిరంగా నడిపించుకునే ప్రయత్నం చేస్తే మీకే మంచిది,” అంతో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.