భువనగిరి నుంచి పోటీ చేస్తాం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాం: సీపీఎం

March 29, 2024


img

మే 13న జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో సీపీఎం పార్టీ భువనగిరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన్నట్లు ఆ  పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే మిగిలిన నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు.

రాష్ట్రంలో మతతత్వ బీజేపీ బలపడకుండా నిలువరించేందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వీరభద్రం చెప్పారు. త్వరలోనే తమ పార్టీ అభ్యర్ధి పేరు ప్రకటిస్తామని చెప్పారు. 

భువనగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా చామల కిరణ్ కుమార్‌ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా బూర నర్సయ్య గౌడ్, బిఆర్ఎస్ అభ్యర్ధిగా క్యామ మల్లేశ్ పోటీ చేయబోతున్నారు. భువనగిరిలో మంచి పట్టున్న సీపీఎం కూడా ఇప్పుడు పోటీకి దిగుతుండటంతో నాలుగు పార్టీల మద్య ఓట్లు చీలితే కాంగ్రెస్‌, బీజేపీలు నష్టపోవడం ఖాయం. 

అయితే మిగిలిన స్థానాలలో ముఖ్యంగా ఖమ్మం, పెద్దపల్లి, అదిలాబాద్, కరీంనగర్‌, నల్గొండ, నాగర్‌కర్నూల్‌ వంటి నియోజకవర్గాలలో సీపీఎం మద్దతు కాంగ్రెస్ పార్టీకి చాలా కలిసి వస్తుంది.


Related Post