దాదాపు రెండున్నర దశాబ్ధాలపాటు తెలంగాణ రాజకీయాలను శాశించిన కేసీఆర్కు ఒక్కసారి పార్టీ ఎన్నికలలో ఓడిపోగానే వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి. పార్టీ సెక్రెటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించిన రోజునే కేసీఆర్కు మరో పెద్ద షాక్ తగిలింది.
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టుబట్టి వరంగల్ ఎంపీ సీటుని తన కూతురు డాక్టర్ కడియం కావ్యకు ఇప్పించుకున్న సంగతి తెలిసిందే. అందుకు ఆమె కేసీఆర్ని కృతజ్ఞతలు తెలుపుకున్నారు కూడా. కానీ తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ఆమె నిన్న ఓ లేఖ వ్రాసి కేసీఆర్కు షాక్ ఇచ్చారు. అదే పెద్ద షాక్ అనుకుంటే అందుకు ఆమె ఆ లేఖలో పేర్కొన్న కారణాలు కేసీఆర్కు ఇంకా పెద్ద షాక్ ఇస్థాయి. ఇంతకీ ఆమె ఎందుకు తప్పుకున్నారు? ఆ లేఖలో ఏమి వ్రాశారో మీరే చదవండి.