తెలంగాణలో కేసీఆర్ దొర నిరంకుశ పాలనను అంతమొందించి బహుజనులకు రాజ్యాధికారం సాధిస్తానంటూ బీఎస్పీ మాజీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఎన్ని మాటలు మాట్లాడారో అందరికీ తెలుసు.
ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు ఓ గ్రామంలో పర్యటించినప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అని స్టిక్కర్ అంటించి ఉన్న ఓ గుడిసెలో ప్రవేశించి, దానిని మీడియాకు చూపిస్తూ, “ఇది డబుల్ బెడ్ రూమ్ ఇల్లట.
దీనికి ఈ ఇంటి యజమాని ఇంటిపన్ను కూడా కడుతున్నాడట! సిగ్గుండాలి కేసీఆర్... నువ్వు ఏ మొహం పెట్టుకొని జనాల వద్దకు వచ్చి నా కారు గుర్తుకి ఓట్లేయాలని అడుగుతున్నావు? ఛీ! నిన్ను మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిని కానీయము. బీఎస్పీ అధికారంలోకి రాగానే నిన్ను జైలుకి పంపిస్తాము,” అంటూ హెచ్చరించారు.
ఇప్పుడు అదే ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి, నాగర్కర్నూల్ ఎంపీ టికెట్ కోసం కేసీఆర్ పంచన చేరడంతో ఆనాడు ఆయన కేసీఆర్ని ఉద్దేశ్యించి మాట్లాడిన మాటలను ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇప్పుడు నువ్వు మాత్రం ప్రజల వద్దకు ఏ మొహం పెట్టుకొని వెళతావు? ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతావు? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా!