బిఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికలకు ముందు మరో షాక్ తగులబోతోంది. మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోబోతున్నారు. ఆయనకు బీజేపీ అధిష్టానం నల్గొండ నుంచి లోక్సభకు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా ఇప్పటికే సిద్దమైంది. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరికలు పూర్తయితే తొలి జాబితా విడుదల చేయాలని బీజేపీ అధిష్టానం ఎదురుచూస్తోంది.
బిఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్(జహీరాబాద్), పోతుగంటి రాములు (నాగర్కర్నూల్) బీజేపీలో చేరిపోతున్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా బీజేపీలోకి జంప్ అయిపోయే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో తెరవెనుక మంతనాలు సాగిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 20 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారంటూ బాంబు పేల్చారు. లోక్సభ ఎన్నికల తర్వాత కొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేదా నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.