మాదక ద్రవ్యాలకు వ్యతిరేకిస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన వివాదాస్పదమైన ‘వైట్ ఛాలెంజ్’కు అడుగడుగునా విమర్శలు, వ్యతిరేకత వస్తోంది. రేవంత్ రెడ్డి విసిరిన ఈ సవాలును స్వీకరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మళ్ళీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్కి, బీఎస్పీ కన్వీనర్ ప్రవీణ్ కుమార్కి ఈ సవాలు విసిరారు. దీనికి ప్రవీణ్ కుమార్ చాలా భిన్నంగా ట్విట్టర్లో స్పందించారు. సమస్యలు, కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ సరికొత్త డ్రామా అని, తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ట్విట్టర్ చేశారు.