దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కరోనా తీవ్రత మళ్ళీ పెరిగిపోవడంతో కేంద్ర హోంశాఖ నేడు అన్ని రాష్ట్రాలకు తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీటిని ఖచ్చితంగా అమలుచేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
• రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి. మాస్క్లు, భౌతిక దూరం, శానిటైజర్ వినియోగం పెంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నవారిపై జరిమానాలు విధించాలి.
• ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు 70శాతంకు పెంచాలి.
• వైరస్ తీవ్రతను బట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరిని ఆంక్షలు, చర్యలు తీసుకోవచ్చు.
• పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచి వైద్యం అందించాలి. పాజిటివ్ బాధితులు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్ చేయాలి. కేసులు అధికంగా ఉంటే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలి. ఆ జోన్లో ఇంటింటి సర్వే చేసి పరీక్షలు చేయాలి.
• విద్యాలయాలు, కార్యాలయాలు, రవాణా, హోటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లు ఉద్యానవనాలు, జిమ్ కేందద్రాలు తదితర ప్రాంతాల్లో కరోనా నిబంధనలు విధిగా పాటించాలి.
• వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసున్న వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు.
• అంతరాష్ట్ర రాకపోకలపై ఎటువంటి నిషేదమూ లేదు. కనుక అంతరాష్ట్ర ప్రజారవాణా, సరుకు రవాణాలకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు.
• అంతర్జాతీయ పౌరవిమాన సేవలపై విధించిన నిషేదాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించబడింది.
ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు వర్తిస్తాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.