ఆలేరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు శుక్రవారం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో వెంటనే ఆమె హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చేరిపోయారు. ఆమె భర్త నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కూడా నిన్న కరోనా పరీక్షలు చేశారు. ఆ రిపోర్ట్ ఇంకా రావలసి ఉంది. గత వారం పదిరోజులలో గొంగిడి దంపతులతో సన్నిహితంగా మెలిగినవారిని ఆరోగ్యశాఖ సిబ్బంది గుర్తించి, క్వారెంటైన్కు పంపిస్తున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మొదట ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ ఆ తరువాత బీగాల గణేశ్ గుప్తాలకు కరోనా సోకింది. ఇప్పుడు గొంగిడి సునీత కరోనాబారిన పడ్డారు. ప్రతిపక్ష నేతలలో సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుకు కరోనా సోకడంతో హైదరాబాద్లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రగతి భవన్లో 30 మంది సిబ్బందికి కరోనా సోకడంతో సిఎం కేసీఆర్ గజ్వేల్లోని తన సొంత ఇంటికి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.