నగరంలోని శిల్పారామంకు లభిస్తున్న ప్రజాధారణ, కళాకారులకు కలుగుతున మేలు దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ హైదరాబాద్ ఉప్పల్లో మరొక శిల్పారామం ఏర్పాటు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం దానిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కేటీఆర్ చొరవ కారణంగానే ఇక్కడ ఈ శిల్పారామం ఏర్పడింది. దీనివలన ప్రజలకు వినోదం, కళాకారులకు వారి కళలను ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. శిల్పారామంకు లభిస్తున్న ప్రజాధారణ చూస్తున్నప్పుడు రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందనిపిస్తోంది,” అని అన్నారు.