మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా చేస్తున్న ‘కొరియన్ కనకరాజు’ నుంచి ‘కంసహమిడ’ అంటూ సాగే తొలి పాట ప్రమో నేడు విడుదలైంది. పూర్తిపాట రేపు సాయంత్రం 4.05 గంటలకు విడుదల కాబోతోంది.
కాసర్ల శ్యాం వ్రాసిన ఈ పాటని తమన్ స్వరపరిచి సంగీతం అందించగా సిద్ శ్రీరాం పాడారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ రెడ్డి చేస్తున్నారు.
దక్షిణ కొరియా నేపధ్యంలో హర్రర్-కామెడీ జోనర్లో రూపొందిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్నారు.