మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న కూకట్పల్లిలో అట్టహాసంగా వేలాదిమంది అభిమానుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అలాగే దర్శకుడు మారుతి కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది కనుక ఇప్పుడు అభిమానులు మిగిలిన పాటలు, రెండో ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ రెండో ట్రైలర్ సోమవారం విడుదల కాబోతోంది. తెలుగు ట్రైలర్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. హిందీ ట్రైలర్ కూడా సిద్దమైతే రేపు విడుదల చేయాలనుకుంతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. జనవరి 9న సంక్రాంతి పండగకు ముందు రాజాసాబ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు.