మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘రాజాసాబ్’ జనవరి 9న సంక్రాంతి పండగకు ముందు విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కనుక రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సన్నాహాలు మొదలుపెట్ట్టారు.
ఈ నెల 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగబోతోంది. కానీ ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. బహుశః ఏపీలో విజయవాడ లేదా విశాఖపట్నంలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఇలాంటి సినీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కనుక అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ రాజాసాబ్పై అంచనాలు భారీగా పెంచేసింది. మారుతి మార్క్ హర్రర్ కామెడీ, ప్రభాస్ టైమింగ్ సరిగ్గా సెట్ అయితే ఎలా ఉంటుందో ట్రైలర్లో చూపారు.
ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.