అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి ‘మీసాల పిల్లా...’ అంటూ సాగే పాట ప్రమో విడుదల చేశారు. పూర్తిపాట త్వరలో విడుదల చేయబోతున్నారు.
భాస్కరభట్ల వ్రాసిన ఈ పాటకి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ కలిసి పాడారు.
దసరా పండుగ ముందు రోజే నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి, తర్వాత మీసాల పిల్ల ప్రమో విడుదల చేయడంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి పండుగకి విడుదల కాబోతోంది.