నందమూరి బాలకృష్ణ అభిమానులకు అఖండ-2 చిత్ర బృందం దసరా పండగ సందర్భంగా ఈ సినిమాలో బాలయ్య పోస్టర్ బహుమతిగా అందించింది. త్రిశూలం పట్టుకొని రౌద్రరూపంతో చూస్తున్న బాలయ్య పోస్టర్ అందరినీ చాలా ఆకట్టుకుంటోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న అఖండ-2: తాండవం సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకున్నారు కానీ అనివార్య కారణాల వలన వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబర్ 5న అఖండ-2: తాండవం విడుదల చేస్తామని సితార ఎంటర్టైన్మెంట్స్ తెలియజేసింది. ఈరోజు విడుదల చేసిన బాలయ్య పోస్టర్లో కూడా ఇది ధ్రువీకరించారు.
అఖండ-2: తాండవంలో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.