వెంకట్ కల్యాణ్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా చేస్తున్న ‘జటాధర’ నుంచి ‘ధన పిశాచి’ లిరికల్ సాంగ్ విడుదలైంది. శ్రీహర్ష ఏమని వ్రాసిన ఈ పాట సౌరభ్ లోఖండే సంగీతం అందించగా సాహితీ చాగంటి పాడారు. ఈ పాటకి దుర్గాదేవి అవతారంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. ఈ సినిమాతోనే ఆమె కూడా టాలీవుడ్లో ప్రవేశిస్తున్నారు.
జటాధరలో రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ఝాన్సీ, శ్రేయ శర్మ, నవీన్ నేని, ఇందిరా కృష్ణ రవి ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
జీ స్టూడియో బ్యానర్పై ఉమేశ్ కె.ఆర్.భన్సాల్, ప్రేరణ అరోరా కలిసి నిర్మిస్తున్న జటాధరకు కధ: వెంకట్ కళ్యాణ్, దర్శకత్వం: వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ చేశారు. నవంబర్ 7న జటాధర విడుదల కాబోతోంది.