డిజే టిల్లు దర్శకుడి కొత్త సినిమా: అనుమాన పక్షి!

October 03, 2025


img

విమల్ కృష్ణ ‘డిజే టిల్లు’తో ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకులలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. నిన్న విజయ దశమి సందర్భంగా కొత్త సినిమా ‘అనుమాన పక్షి’కి కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేశారు.  

 ఈ సినిమాతో కొత్త హీరో, హీరోయిన్లు రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్‌లను పరిచయం చేస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దంద్‌ కలిసి నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో బ్రహ్మాజీ, అనన్యా, చారిత్, సుప్రీత్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: విమల్ రామకృష్ణ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: సునీల్ కుమార్‌ నామా, ఎడిటింగ్: అభినవ్ కూనపరెడ్డి, ఆర్ట్: జేకే మూర్తి చేస్తున్నారు.           


Related Post

సినిమా స‌మీక్ష