శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలలో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కుబేర’పై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. రెండు వారాల క్రితం విడుదలైన ‘పోయిరా మావా’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్కు, దానికి ధనుష్ చేసిన డాన్స్కు మంచి ఆదరణ లభిస్తోంది.
తాజాగా ధనుష్, రష్మికలతో వ పోస్టర్ విడుదల చేశారు. అంతకు ముందు విడుదల చేసిన పోస్టర్లో ధనుష్ని బిచ్చగాడిగా చూపారు. కనుక తాజా పోస్టర్లో వారిద్దరూ గట్టు మీద కూర్చొని హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నట్లు చూపారు. ఇంతకీ ఈ సినిమాలో వారిద్దరి పాత్రల మద్య ఎటువంటి సంబంధం ఉంది? ఇంత చక్కగా ఉన్న ధనుష్ బిచ్చగాడిగా ఎలా మారిపోయాడు?అనే ఆసక్తి రేకెత్తించారు శేఖర్ కమ్ముల ఈ ఒక్క పోస్టర్తో.
ఈ సినిమాలో జిమ్ సరబ్ వ ముఖ్యపాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. జూన్ 20 వ తేదీన కుబేర ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.