జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్లో చిన్న అవాంతరం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అటవీ ప్రాంతంలో దేవర సినిమా షూటింగ్ జరుగుతోంది.
షూటింగ్ జరుగుతున్నప్పుడు లైట్లు, చప్పుళ్ళకు అక్కడే ఉన్న తేనెటీగలు వారిపై దాడి చేశాయి. తేనెటీగల దాడిలో జూనియర్ ఆర్టిస్టులతో సహా మొత్తం 20 మంది యూనిట్ సభ్యులు గాయపడిన్నట్లు తెలుస్తోంది. వెంటనే వారందరినీ పాడేరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై దేవర టీమ్ అధికారిక ప్రకటన చేయలేదు.
కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
రూ. 300 కోట్ల భారీ బడ్జెట్తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి దేవర సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5 వ తేదీన విడుదల కాబోతోంది.