అల్లు అర్జున్, రష్మిక మండన జంటగా వస్తున్న పుష్ప-2 సినిమాపై చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా కోసం కేవలం తెలుగు ప్రజలే కాదు యావత్ దేశ ప్రజలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అందుకే ఆ సినిమా టీజర్, ప్రమో సాంగ్ అంత వైరల్ అవుతున్నాయి. అందుకే ఆ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.275 కోట్లకు అమ్ముడుపోయింది. సినిమా రిలీజ్ కాక ముందే ఇంత భారీ బిజినెస్ చేస్తున్నప్పుడు, ఆగస్ట్ 15కి పండుగ సీజన్లో మొదలయ్యే ముందు సినిమా విడుదలైతే ఇంకెంత బిజినెస్ చేస్తుందో ఊహించలేము కూడా.
కనుక ఈ సినిమా చేయడానికి నిర్మాతలు అల్లు అర్జున్కి రూ.150 కోట్లు పారితోషికం ముట్టజెప్పుతున్నారట! మన దేశంలో ఈ స్థాయి పారితోషికం తీసుకునే హీరోలు అతికొద్ది మందే ఉన్నారు. అల్లు అర్జున్ వారిలో ఒకరుగా నిలవడం చాలా గొప్ప విషయమే.
ఇక పుష్ప-2 సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో కూడా ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా చేరారు. ఆయన ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు.
పుష్ప-2 తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.