తెలంగాణ ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం

July 02, 2026


img

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జూనియర్ కాలేజీ విద్యార్ధులకు కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన పధకాన్ని వర్తింపజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్ధులతో పాటు ఉపాధ్యాయులు, భోధనేతర సిబ్బందికి కూడా ఈ పధకాన్ని విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నేడు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

కనుక ఇకపై ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతీరోజూ పొద్దున్న లేవగానే టిఫిన్లు, క్యారేజీలు అంటూ హడావుడి పడకుండా నిశ్చింతగా స్కూల్, కాలేజీలకు బయలుదేరిపోవచ్చు. ఉపాధ్యాయులకు కూడా ఈ పధకం వర్తింపజేయడం ద్వారా అల్పాహారం, మధ్యాహ్నం భోజనంలో నాణ్యత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. 



Related Post