స్వాగ్ దర్శకుడి చేతిలో సిద్ధూ జొన్నలగడ్డ?

February 12, 2026


img

యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం స్వరూప్ రాజ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఇది చేస్తుండగానే సిద్ధూ మరో సినిమాని లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. రాజరాజ చోళ, స్వాగ్ వంటి విభిన్నమైన కధాంశాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు హసిత్ గోలి సిద్ధూ కోసం ఓ కధ సిద్ధం చేసి వినిపించగా, సిద్ధూ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు సాగితే ఈ సినిమాని దిల్ రాజు తన సొంత బ్యానర్‌పై నిర్మించే అవకాశం ఉంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష