ప్రముఖ నటుడు సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న ‘శంభాల’ ఈ నెల 25న విడుదల కాబోతోంది. మూడ నమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే హీరో అతీంద్రియ శక్తులను కళ్ళార చూశాక అతనిలో మార్పు వస్తుందా లేదా? వాటి కారణంగా చనిపోతున్న ఊర్లో జనాలను ఏవిదంగా కాపడుతానేది ఈ సినిమా కధ. ఇదివరకే ఓ ట్రైలర్ విడుదల చేశారు. నేడు మిస్టారికల్ అంటూ మరో ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో ఆదికి జోడీగా అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో శ్వాశిక విజయ్, అన్నపూర్ణమ్మ, హర్షవర్ధన్, శివ కార్తీక్, శైలజ ప్రియ, చైత్ర, రామరాజు, రంగనాధం, శ్రావణ సంధ్య థియేటర్, మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, శిజూ మీనన్ ముఖ్య పాత్రలు చేశారు.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: ప్రవీణ్ కె బంగారి, ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని, ఆర్ట్: జేకే మూర్తి, స్టంట్స్: రాజ్ కుమార్ చేస్తున్నారు. డిసెంబర్ 25న శంభాల విడుదల కాబోతోంది.