బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్ర చేసిన అఖండ-2 డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దు అయిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ సంస్థ, ఇరోస్ ఇంటర్ నేషనల్ కంపెనీ మద్య సోమవారం రాత్రి చర్చలు ఫలించి రాజీ కుదరడంతో ఆ విషయం నేడు మద్రాస్ హైకోర్టుకి తెలియజేశారు.
కోర్టు వెలుపల రాజీ కుదుర్చుకొని కేసీఆర్ ఉపసంహరించుకోవడంతో న్యాయస్థానం కూడా అఖండ-2 విడుదలపై విధించిన స్టే ఉత్తర్వులు ఎత్తివిసినట్లు ప్రకటించింది. దీంతో డిసెంబర్ 11న రాత్రి 9 గంటల నుంచి అఖండ-2 ప్రీమియర్స్, మర్నాడు అంటే 12న సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్పై తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంటలతో కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో అఖండ-2 నిర్మించారు.