ప్రముఖ కోలీవుడ్ నటుడు సూర్య, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో ‘సూర్య 46’ వర్కింగ్ టైటిల్తో సినిమా మొదలైంది. సోమవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమం జరిగింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముహూర్తం షాట్కి క్లాప్ కొట్టి ప్రారంబించారు. ఈ సినిమాలో సూర్యకి జోడీగా మమిత బైజు నటించబోతుండగా, రాధికా శరత్ కుమార్, రవీనా టండన్ ముఖ్య పాత్రలు చేయబోతున్నారు.
సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత నాగ వంశీ చెప్పారు. జూన్ నెలాఖరులోగా షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది.