టాలీవుడ్లో గోపీ చంద్ అనేక సినిమాలు చేశారు. వాటిలో కొన్ని పెద్ద హిట్స్ ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. శ్రీను వైట్ల వంటి సక్సస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్తో చేసిన ‘విశ్వం’ కూడా తీవ్ర నిరాశపరిచింది. దాని తర్వాత సూపర్ హిట్ సినిమా ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో నెల రోజుల క్రితం ఓ సినిమా మొదలుపెట్టారు.
ఆ సినిమా షూటింగ్ ఇంకా మొదలవక మునుపే గోపీచంద్ మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారు. ఈసారి కొత్త దర్శకుడు కుమార్ సాయితో కలిసి సినిమా చేయబోతున్నారు. గురువారం హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది.
శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్పై ప్రొడక్షన్ నంబర్:39గా ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్న ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కేరళకు చెందిన మీనాక్షి దినేశ్ నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫీ: శ్యామ్ దత్. యాక్షన్-థ్రిల్లర్ జోనర్లో తీయబోతున్న ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతహ ప్రసాద్ తెలిపారు.
ఈ రెండు సినిమాలలో ఒకటి ఈ ఏడాది డిసెంబర్లోగా విడుదల చేసి మరొకటి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.