ఇదివరకు పవన్ కళ్యాణ్ అంటే నటుడుగానే అందరికీ సుపరిచితం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మరో గుర్తింపు సంపాదించుకున్నారు.
సినీ పరిశ్రమ నుంచి ఆయన రాజకీయాలలోకి ప్రవేశించడంతో మొదలుపెట్టిన రెండు సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఇంత వరకు పూర్తి చేయలేకపోయారు. ఈ కారణంగా ఆ సినిమాలపై ఇప్పటికే చాలా ఖర్చు చేసిన నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
మరోపక్క ఆ సినిమా కోసం డేట్స్ ఇచ్చిన ఇతర నటీనటులు కూడా సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆ సినిమా నిర్మాతలు ఇటీవల పవన్ కళ్యాణ్ని కలిసి తమ సమస్యలు చెప్పుకొని ఎలాగైనా డేట్స్ అడ్జస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ కూడా సినీ పరిశ్రమ నుంచి వచ్చినవారే కనుక వారి సమస్యని అర్ధం చేసుకొని 3-4 నెలల్లో రెండు సినిమాలకు బల్క్ డేట్స్ ఇచ్చి పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు పూర్తిచేశారు. కనుక ఈ సినిమా మే 9 న విడుదల కాబోతోంది.
దీని తర్వాత ఓజీ మొదలు పెట్టి అది పూర్తికాగానే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇకపై కొత్త సినిమాలు ఏవీ ఒప్పుకోకూడదని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.