శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలలో ‘కుబేర’ నుంచి ‘పోయిరా పోయిరా మామ..’ అంటూ సాగే మొదటి పాట విడుదలైంది.
భాస్కర భట్ల వ్రాసిన ఈ పాటని దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఈ పాటని ధనుష్ పాడారు. పాటతో పాటు మేకింగ్ వీడియో కూడా జోడించడంతో అందరినీ మరింత ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో నాగార్జున ధనవంతుడుగా, ధనుష్ బిచ్చగాడిగా నటించారు. కుబేరలో రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. జూన్ 20న కుబేరా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.