బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా 2023 జనవరిలో విడుదలైన ‘అఖండ’ సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్గా అఖండ-2 తీస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో ఇంతవరకు తీసిన సింహా, లిజండ్, అఖండ మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో అఖండ-2పై చాలా భారీ అంచనాలున్నాయి.
కనుక ఈ సినిమా హక్కుల కోసం ఓ పక్క డిస్ట్రిబ్యూటర్లు మరోపక్క అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.
అఖండ-2ని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించినందున దర్శకుడు బోయపాటి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. బాలయ్య కూడా షూటింగ్ హాజరయ్యే విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు కనుక శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అది పూర్తయ్యేలోగానే ఆడియో, డిజిటల్ రైట్స్ డీల్స్ పూర్తిచేయబోతున్నట్లు తెలుస్తోంది.
అఖండ-2లో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో అఖండ-2 నిర్మిస్తున్నారు.