హర్షిత్ రెడ్డి, స్మేహ మనిమేగలై జంటగా చేస్తున్న ‘దీవానా’ టీజర్ వచ్చేసింది. అయితే టీజర్ ప్రమోషన్స్ అద్భుతంగా అనిపించినప్పటికీ టీజర్ మాత్రం రొటీన్గానే అనిపిస్తుంది. కానీ టీజర్ని చూసి సినిమాని అంచనా వేయడం తొందరపాటే అవుతుంది కనుక విడుదలయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి, సంగీతం:ఈశ్వర్ చంద్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, ఎడిటింగ్:హృషికేశ్ పస్పాల్ చేస్తున్నారు.
అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్లో ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.