మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు నిన్న హోలీ సందర్భంగా గొప్ప శుభవార్త ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. రామ్ చరణ్ తన 17వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించింది.
వారిద్దరి కాంబినేషన్లో 2018లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వారిద్దరూ కలిసి మరో సినిమా చేయబోతుండటం అభిమానులకు చాలా సంతోషం కలిగించే విషయమే కదా? అయితే ఇది రంగస్థలం సినిమాకు సీక్వెల్గా తీయబోతున్నారా వేరే కొత్త కధతో తీస్తారా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది.
ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానతో కలిసి తన 16వ సినిమా మొదలుపెట్టారు. ఇటీవలే ఆ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ నటించబోతోంది.
రామ్ చరణ్-శంకర్ సినిమా గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. అది పూర్తవగానే బుచ్చిబాబు, సుకుమార్ ఇద్దరితో ఒకేసారి సినిమాలు మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.