తెలంగాణలో సినిమా టికెట్స్ ధరలు రూ.50 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం ఉన్న ధరలపై రూ.50 చొప్పున పెంచుకొనేందుకు హైకోర్టు అనుమతించడంతో నేటి నుంచే పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. సినీ నిర్మాతలు చేసిన ఈ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ అది ఇంతవరకు ఎటువంటి నిర్ణయమూ తీసుకోపోవడంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అన్ని చిత్రాలకు కాక కేవలం భారీ బడ్జెట్లతో రూపొందించిన చిత్రాలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ ఈరోజు విడుదలయ్యింది. కనుక హైకోర్టు తాజా తీర్పుతో ఈ సినిమా నిర్మాతలకు ఊరట లభిస్తుంది.