కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఆచార్య 2022, ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఆ తరువాత కొన్ని వారాలకు అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది. దీని డిజిటల్ స్త్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ ఆచార్య నిర్మాతకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆచార్యలో రామ్ చరణ్ చేస్తున్న సిద్ధార్థ్ పాత్రకు సంబందించి టీజర్ ‘సిద్ద సాగా’ పేరుతో ఈనెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు కెమెరా తిర్రు, సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.