సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణాయాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ప్రభుత్వమే సొంత వెబ్ సైట్ ద్వారా సినిమా టికెట్లు అమ్మేలా జివో విడుదల చేశారు. ఈ విషయంపై టాలీవుడ్ డైరక్టర్ దేవా కట్ట స్పందించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సంచలన కామెంట్స్ చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలు అంటే రైల్వేస్ వంటి విషయాల్లో ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్లు పెట్టి విక్రయించడం మంచిదే కాని ప్రైవేట్ వ్యక్తులకు సంబందించిన సినిమాల విషయంలో ప్రభుత్వ ఈ పద్ధతి ప్రవేశపెట్టడం ఆమోదయోగ్యంగా లేదని ఆయన అన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు మాదిరిగా సినీ నిర్మాతలు కూడా ప్రభుత్వం ముందు తమ డబ్బు కోసం వేచి ఉండాల్సి వస్తుందేమో అని దేవాకట్ట అన్నారు. సినీ నిర్మాతల డబ్బు విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం నిర్మాణ విషయంలో బడ్జెట్ కేటాయించి సహకరిస్తుందా అని ఆయన అన్నారు.