యువ దర్శకుడితో శర్వానంద్..!

June 17, 2021


img

యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం మహా సముద్రం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాతో పాటుగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత షార్ట్ ఫిల్మ్ డైరక్టర్ దీపక్ రెడ్డితో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. మనసానమ: షార్ట్ ఫిల్మ్ తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు దీపక్ రెడ్డి ఓ మంచి కథతో యువి క్రియేషన్స్ నిర్మాతలను కలిశాడట. సినిమా నిర్మించేందుకు వారు రెడీ అవగా హీరోగా శర్వానంద్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. శర్వానంద్ కి కూడా దీపక్ చెప్పిన కథ నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు తెలుస్తుంది.

శ్రీకారం సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవకపోవడంతో శర్వానంద్ తను చేస్తున్న సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న మహా సముద్రం సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటుగా బొమ్మరిల్లు సిద్ధార్థ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష