తెలంగాణలో రెండు హైవేల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్‌

June 04, 2026


img

తెలంగాణలో రూ. 7,5947.16కోట్లు వ్యయంతో కొత్తగా 190 కిమీ పొడవునా రెండు జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకి ఆమోదముద్ర వేశారు. 

దీనిలో భాగంగా కరీంనగర్‌-జగిత్యాలమద్య 58.8 కిమీ, ఆర్మూర్-మంచిర్యాల మద్య 134.9 కిమీ పొడవునా రెండు హైవేలు నిర్మిస్తారు.  

నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల జాతీయ రహదారిలో అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టి పేట తదితర ప్రాంతాలున్నాయి. 

అదేవిధంగా జగిత్యాల-కరీంనగర్‌ మార్గంలో పోతారం, గంగాధర వంటి పలు ముఖ్య ప్రాంతాలు ఉన్నాయి. ఈ కారణంగా జాతీయ రహదారి నం.63, 563 ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటాయి. కనుక ఈ రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ మంచిర్యాల-ఆర్మూర్‌ మద్య, అలాగే కరీంనగర్‌-జగిత్యాల మద్య మరొకటి నాలుగులేన్లతో విశాలమైన బైపాస్ రోడ్లను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

ఇవి అందుబాటులోకి వస్తే వీటిపై గంటకు వంద కిమీ వేగంగా వాహనాలు ప్రయాణించగలుగుతాయి. అప్పుడు ఆర్మూర్-మంచిర్యాల మద్య ప్రయాణ సమయం సుమారు గంటన్నర తగ్గుతుంది. అదేవిధంగా కరీంనగర్‌-జగిత్యాల మద్య ప్రయాణ సమస్యం 45 నిమిషాలు తగ్గుతుంది.   

<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">తెలంగాణలోని రెండు కీలక జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం తెలిపిన గౌరవ ప్రధాని శ్రీ <a href="https://x.com/narendramodi?ref_src=twsrc%5Etfw">@narendramodi</a> గారికి, కేంద్ర మంత్రి శ్రీ <a href="https://x.com/nitin_gadkari?ref_src=twsrc%5Etfw">@nitin_gadkari</a> గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.<br><br>ఈ నిర్ణయం వల్ల ఉత్తర తెలంగాణలో వివిధ ప్రాంతాల మధ్య రవాణా సులభతరం అవడమే కాకుండా, ఆర్థిక… <a href="https://t.co/3kEPNJQfZg">https://t.co/3kEPNJQfZg</a></p>&mdash; G Kishan Reddy (@kishanreddybjp) <a href="https://x.com/kishanreddybjp/status/2062225268492972036?ref_src=twsrc%5Etfw">June 3, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

Related Post