జిహెచ్ఎంసి మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలంగాణ మహిళా కమీషన్ చైర్ పర్సన్గా నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి.. తల్లి శంకరమ్మకు కూడా కమీషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావు నేడు ఉత్తర్వులు జారీ చేశారు. కమీషన్ ఇతర సభ్యుల పేర్లు: చిట్యాల శ్వేత, శశికళ యాదవ రెడ్డి, ఉజ్మా ఆషాయ్ షకీరా, సదాలక్ష్మి, ఎన్. రాదాభాయి. వీరందరూ 5 ఏళ్ళు ఈ పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
గద్వాల్ విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డిని కలిసి తనని ఈ పదవికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, హక్కులని కాపాడేందుకు తాను, కమీషన్ సభ్యులు చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.