సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా జరుగబోతోంది. ఫ్యూచర్ సిటీగా పేర్కొంటున్న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఈ సదస్సు జరుగబోతోంది. దీనిలో దేశవిదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఆ ప్రముఖులు వీరే...
ఒలింపిక్ అవార్డ్ విన్నర్: బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు,
మాజీ క్రీడాకారులు: అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా సుఖేందర్ రెడ్డి,
క్రియేటివ్ సెషన్లో పాల్గొనబోయే సినీ ప్రముఖులు: దర్శకులు రాజమౌళి, సుకుమార్, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్, గుణీత్ మోంగా, అనుపమ చోప్రా,
నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త: అభిజిత్ బెనర్జీ
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత: కైలాష్ సత్యార్థి
బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్: కిరణ్ మజుందార్-షా
ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ సీఈఓ: ఎరిక్ స్వైడర్
వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో: జెరెమీ జుర్గెన్స్.
పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో పారిశ్రామిక దిగ్గజాలు, ఐటి కంపెనీల సీఈవోలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సదస్సుకి పలువురు ప్రముఖులు వస్తున్నందున భారీగా పోలీసులు మొహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.