మహేష్ చంద్ర దర్శకత్వంలో డా. రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్ ప్రధాన పాత్రల్లో నటించిన పిఠాపురంలో అలా మొదలైంది చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో జూనియర్ పవన్ కళ్యాణ్, జబర్దస్త్ శేషు, ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడ్యార్ కీలక పాత్రలలో నటించారు.
ఈ సినిమాకు కథ: ఆకుల సురేష్ పటేల్, మాటలు & స్క్రీన్ప్లే: శ్రీరామ్ ఈదోటి, సంగీతం: జి.సి.క్రిష్, అందించారు.
ప్రేమ, హాస్యం, తండ్రీకూతుర్ల సెంటిమెంట్తో పాటు యువతకు మంచి సందేశం ఇచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు. ఎటువంటి అసభ్య డైలాగ్స్, అసభ్య సన్నివేశాలు లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా దీనిని తెరకెక్కించామని చెప్పారు. .
చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్లపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను ఈ నెల 18న విడుదల చేస్తోంది.