వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ కోలీవుడ్ నటుడు సూర్య, మమితా బైజు జంటగా చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 11 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్ఫ్లిక్స్ స్వయంగా ఈ విషయం ప్రకటించింది.
క్లుప్తంగా కథ సంపన్న కుటుంబానికి చెందిన 40 ఏళ్ళు వయసున్న సంజయ్ విశ్వనాథ్ (సూర్య), పెళ్ళి చేసుకోకుండా సరోగసీ పద్దతిలో ఓ పిల్లాడికి తండ్రి అవుతాడు. కానీ ఊహించని విధంగా ఆ బాబుకు జబ్బు పడతాడు. అతని చికిత్స కోసం తప్పనిసరిగా కన్నతల్లి అవసరం కనుక మళ్ళీ అమెరికా వెళ్తాడు. అక్కడ మ్యాడీ మధన కామేశ్వరి (మమతా బైజు) పరిచయం అవుతుంది. విశ్వనాథ్ వయసులో తన కంటే చాలా పెద్దవాడైనప్పటికీ అతనితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.