ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న కల్కి ఎడి 2898 సినిమా విడుదలపై సస్పెన్స్ కు తెరదించింది వైజయంతీ మూవీస్ సంస్థ. ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదల చేయబోతున్నట్లు శనివారం సాయంత్రం ప్రకటించింది.
ఈ సినిమా రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేసింది. దానిలో హీరోయిన్ దిశా పటానీ, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ముగ్గురినీ చూపారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ మహాభారతంలోని అశ్వధామగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శాశ్వత చటర్జీ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ప్రభాస్కు జోడీగా ఇద్దరు బాలీవుడ్ బ్యూటీలు దీపికా పడుకొనే, దిశా పటానీ నటిస్తున్నారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూ.600 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్డ్జీ స్టోజిల్జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.
All the forces come together for a better tomorrow on 𝟐𝟕-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/kItIJXvbto
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 27, 2024