తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా అతిపెద్ద పేరుతో వస్తోంది.. “ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు” అనే సినిమా.
అతిపెద్ద టైటిల్ కలిగిన ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. అది చూస్తే అయితే సినిమా టైటిల్కి, కథకి సంబంధం ఉందా లేదా? అనే సందేహం కలుగుతుంది.
‘ఆ నలుగురు’ వంటి సూపర్ హిట్ సినిమా దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో హర్ష హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవి వర్మ, అశోక్ వర్ధన్, రేఖానిరోషా తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
“ఎ ఫర్ బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్ బిడెన్ సాగా” అనే ట్యాగ్లైన్తో రూపొందిస్తున్న ఈ సినిమాలో బ్రెయిన్ మ్యాపింగ్, సౌండ్ థెరపీ,మెమొరీస్ వంటి భావోద్వేగాలతో సంగీత ప్రాధాన్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.