ఇప్పుడు తెలుగు సినిమాలలో పలువురు బాలీవుడ్ నటీనటులు కనిపిస్తూనే ఉన్నారు. వారిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కనిస్తుండటమే విశేషమనుకుంటే, ఇప్పుడు టాలీవుడ్ దర్శకత్వం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ హిందీ సినిమా చేస్తుండటం ఇంకా విశేషం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్కి జోడీగా నయనతార నటిస్తున్నారు. రాహుల్ దేవ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ షూటింగ్ నేటి నుంచి ఆరు వారాల పాటు ముంబయిలో జరుగబోతోంది. ఈ షెడ్యూల్లో మూడు భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు వందలాది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ షెడ్యూల్లో నయనతార, రాహుల్ దేవ్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ అక్టోబర్ నాటికి ప్రధాన యాక్షన్ భాగాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం పనిచేస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రంజాన్ పండుగకు విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు.