సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా చేసిన ‘తెలుసు కదా?’ నుంచి సొగసు చూడతరమా పాట ఈ రోజు ఉదయం 11.07 గంటలకు విడుదల కావలసి ఉండగా సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేశారు.
కృష్ణ కాంత్ వ్రాసిన ఈ పాటని తమన్ స్వరపరిచి సంగీతం అందించగా కార్తీక్, అద్వితీయ కలిసి పాడారు. ఈ పాటలో హీరో, హీరోయిన్లకు బదులు కృష్ణ కాంత్, ధమన్లను ఎక్కువగా చూపడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదో రకం ప్రమోషన్ అని సరిపెట్టుకున్నా ధమన్ జోరు చూస్తుంటే ఏదో రోజున సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నీరజ్ కోనా; సంగీతం: థమన్; కెమెరా: జ్ఞాన శేఖర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలవబోతోంది... తెలుసు కదా?