సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా చేసిన ‘ఓజీ’ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నిన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇవాళ్ళ శ్రీయరెడ్డి పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె గీతక్కగా ఆమె నటిస్తున్నారు. తుపాకిని గురిపెట్టి చూస్తున్న పోస్టర్ చూస్తే ఈ సినిమాలో ఆమె ఎటువంటి పాత్ర చేస్తున్నారనే ఆసక్తి రేకెత్తిస్తుంది.
ఆదివారం ఉదయం 10.08 గంటలకు ఓజీ ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఓజీ ఈనెల 25న విడుదల కాబోతోంది.