బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా ‘రామాయణ’ పేరుతో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. రెండు భాగాలుగా తీస్తున్న ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. కానీ మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కాబోతున్నాయి.
షూటింగ్ పూర్తయినందున ఈ నెల 3న బెంగళూరులో అట్టహాసంగా ఓ కార్యక్రమ నిర్వహించి దానిలో రామాయణ ఫస్ట్ గ్లింమ్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణాసురుడిగా కన్నడ నటుడు యశ్, శూర్పణకగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారాదత్తా నటించారు.