ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ తన 31వ సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణీ వసంత్ జూ.ఎన్టీఆర్కి జోడీగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో సాగుతోంది. ముందే చెప్పిన్నట్లు మంగళవారం నుంచి జూ.ఎన్టీఆర్ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యారు. మే 14 వరకు సాగే ఈ షెడ్యూల్లో నాజర్, శీను తదితరులు పాల్గొంటున్నారు.
దీని తర్వాత షెడ్యూల్ కర్ణాటకలో అడవులలో తీయబోతున్నారు. కనుక చిత్ర బృందం అడవులలో లొకేషన్స్ వెతుకుతున్నారు. దట్టమైన అడవులలో సాగే తర్వాత షెడ్యూల్లో ఈ సినిమాలో నటిస్తున్న ప్రధాన నటీనటులందరూ పాల్గొనబోతున్నట్లు సమాచారం.
కర్ణాటకలో ఈ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత, జూ.ఎన్టీఆర్ వార్-2 ప్రమోషన్స్కు హాజరవ్వాల్సి ఉంటుంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ పోలిశెట్టి ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాని 2026 జనవరిలో విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్ ముందే ప్రకటించారు. కనుక ఈ నవంబర్లోగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు.